భారత్ లో స్మార్ట్ ఫోన్లకు కొత్త ముప్పు... 'ఏజెంట్ స్మిత్'!
- గూగుల్ యాప్ లా భ్రమింపజేస్తూ ఫోన్లలో చొరబాటు
- ఫోన్ వినియోగదారుకు తెలియకుండానే కార్యకలాపాలు
- భారత్ లో 1.5 కోట్ల ఫోన్లపై మాల్వేర్ పంజా
ఒక్క మన దేశంలోని 1.5 కోట్ల స్మార్ట్ ఫోన్లపై ఈ మాల్వేర్ పంజా విసిరినట్టు సమాచారం. ఇది గూగుల్ సంబంధిత యాప్ రూపంలో స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించి, అప్పటికే ఇన్ స్టాలైన యాప్ లను ఇష్టానుసారం తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, కొన్ని యాప్స్ సోర్స్ కోడ్ ను కూడా మార్చివేస్తుందట! తన ప్రొఫైల్ లో యాడ్స్ చూపించి ఆండ్రాయిడ్ ఫోన్లను ఇది ఏమార్చుతుందని, ఇది తమ ఫోన్ లో ఉందన్న సంగతి తెలుసుకునేసరికి ఎంతో డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.