అమ్మ మృతి మిస్టరీలా ఉందని నేనెప్పుడో చెప్పా: పన్నీర్ సెల్వం
- ఆసుపత్రిలో ఉండగా ఒక్కసారి కూడా చూడలేదు
- ఆర్ముగస్వామి కమిషన్ నాలుగు సార్లు పిలిచింది
- ముఖ్యమైన పనులుండటంతో వెళ్లలేదు
అయితే ఈ కమిషన్ అప్పట్లో పన్నీర్ సెల్వంను విచారణకు పిలిచినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఈ విషయాలన్నింటిపైనా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, అమ్మ మృతి మిస్టరీలా ఉందని తానెప్పుడో చెప్పానని, దీనిపై విచారణ చేపట్టాలని సైతం కోరానన్నారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తాను ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదన్నారు. అమ్మ మృతిపై విచారణకు వేసిన ఆర్ముగస్వామి కమిషన్ తనను నాలుగు సార్లు పిలిచిందని అయితే ముఖ్యమైన పనులుండటంతో వెళ్లలేదన్నారు. ఈ సారి తనను పిలిస్తే కచ్చితంగా వెళతానని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.