Pawan Kalyan: పార్టీ నిర్మాణంలో పవన్ కల్యాణ్ కీలక ముందడుగు!
జనసేన పార్టీని పూర్తిస్థాయిలో నిర్మించకుండానే ఎన్నికల బరిలో దిగిన పవన్ కల్యాణ్ అందుకు తగిన మూల్యం ఓటమి రూపంలో చెల్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలు నేర్పిన గుణపాఠంతో ఇప్పుడు జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇవాళ జనసేన పార్టీ ముఖ్య కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కమిటీలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ముఖ్య కమిటీలు ఏర్పాటు చేస్తారని సమాచారం.