Chandrababu: ప్రజావేదికపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సీఆర్డీఏ

షార్ట్స్‌లో చూడండి
ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ భవనాన్ని తమకు కేటాయించాల్సిందిగా చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోగా, దాంట్లో ఉన్న టీడీపీ సామగ్రిని బయటపడవేసి ప్రభుత్వ వర్గాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో, ప్రజావేదికపై సీఆర్డీఏ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ప్రజావేదిక నిర్మాణం కోసం రూ.7.50 కోట్లు ఖర్చుచేశారని పేర్కొంది. ప్రజావేదిక నిర్మించిన ప్రాంతం గరిష్ట వరదమట్టం కంటే దిగువన ఉందని, ఉండవల్లిలో ఆ నిర్మాణం సరికాదని అప్పటి జలవనరుల శాఖ సీఈ నివేదిక కూడా ఇచ్చారని సీఆర్డీఏ వివరించింది. నివేదికకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Praja Vedika
Undavalli

More Telugu News