shivathmika: 'దొరసాని' టెన్షన్ తగ్గిందట!

  • నాయకా నాయికల తొలి పరిచయం 
  • 'గడీ' నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • వచ్చేనెల 12వ తేదీన విడుదల  

రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర 'దొరసాని' సినిమాను రూపొందించాడు. శివాత్మిక జోడీగా ఆనంద్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ ఇద్దరూ ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. తెలంగాణలోని ఓ 'గడీ'కి చెందిన అమ్మాయిని, ఓ సాధారణ యువకుడు ప్రేమించడం, దాని పర్యవసానాలతో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున 'ఇస్మార్ట్ శంకర్' ఉండటంతో, 'దొరసాని' టీమ్ టెన్షన్ పడింది. ఎందుకంటే పూరి - రామ్ కాంబినేషన్ కి గల క్రేజ్ వేరు. అయితే తాజాగా ఈ సినిమా వచ్చేనెల 18వ తేదీకి విడుదలను వాయిదా వేసుకుంది. దాంతో 'దొరసాని' టీమ్ హ్యాపీగా ఫీలవుతోందని సమాచారం. 'దొరసాని' రోజునే సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' ఉన్నప్పటికీ దాని జోనర్ వేరు.

More Telugu News