సిద్ధూ! రాజీనామా చేసి వెళ్లిపో.. పంజాబ్ లో ప్రత్యక్షమైన పోస్టర్లు!
- అమేథీలో రాహుల్ గెలుస్తాడన్న సిద్ధూ
- లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
- మాట నిలబెట్టుకోవాలని లూథియానాలో పోస్టర్లు ప్రత్యక్షం
ఒకవేళ గెలవకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కాగా, ఈ ఎన్నికల్లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని 55,120 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ‘సిద్ధూ ఎప్పుడు రాజీనామా చేస్తున్నావ్?’ అని పంజాబ్ లోని లూథియానాలో పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటపై సిద్ధూ నిలబడాలని ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై సిద్ధూ ఇంతవరకూ స్పందించలేదు.