ఏపీలో కొత్త ప్రభుత్వమూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
- ఏ రాష్ట్రానికైనా ‘హోదా’ ఇవ్వాలనుకుంటే ముందుగా ఏపీకే ఇవ్వాలి
- ‘హోదా’కు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదు
- కాళేశ్వరం ప్రాజెక్టుపై మాకు అనుమానాలు ఉన్నాయి
అయితే, ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలు రావడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. తమ అనుమానాలు తీర్చిన తర్వాతే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లాలని డిమాండ్ చేశారు. నికరజలాలు లేకుండా నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.