ఏపీ మంత్రులవుతారనుకుంటే... పదవులు ఆశించి భంగపడ్డ నేతలు!
- జాబితాలో రోజా, భూమన, చెవిరెడ్డి, కొరుముట్ల
- శిల్పా మోహన్ రెడ్డి అంబటి రాంబాబులకూ నిరాశే
- ఫైర్ బ్రాండ్ లుగా ముద్రపడ్డ వారిని పక్కనబెట్టిన జగన్
అయితే, కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి, చెవిరెడ్డికి విప్ పదవి, తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి, కొరుముట్ల శ్రీనివాసులుకి విప్ పదవి లభించాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెలపై విజయం సాధించిన అంబటి రాంబాబుకు కూడా నిరాశే మిగిలింది. కర్నూలు జిల్లా నుంచి శిల్పా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాల్చలేదు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మంగళగిరి ఎమ్మెల్యే-ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు పదవులు ఖాయమని భావించినా, జగన్ వారిని తన క్యాబినెట్ లోకి తీసుకోలేదు.