వినాయకుడి విగ్రహానికి చెమటలు... తండోపతండాలుగా భక్తుల రాక!
- బీహార్ గయలో ఘటన
- తాకితే తడిగా ఉంటున్న వినాయక విగ్రహం
- స్వామివారు ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్నారన్న పూజారులు
దాంతో స్వామివారికి వేసవితాపం కారణంగా చెమటలు పోస్తున్నాయంటూ ప్రచారం మొదలైంది. కొద్దిసమయంలో అది గయ పరిసర ప్రాంతాలకు పాకడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎండలు మండిపోవడంతో ప్రజలే కాకుండా దేవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడని అర్చకులు చెబుతున్నారు. అందుకే, గణేశుడి విగ్రహానికి చల్లదనం కలిగించేలా చందన పూతలు పూయడమే కాదు, గర్భగుడిలో వేడిని తగ్గించేందుకు రెండు ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు.
అయితే, ఈ ఘటనపై సైన్స్ నిపుణులు భిన్నంగా చెబుతున్నారు. పగడపు రాయితో తయారైన విగ్రహాలు ఎప్పుడూ వేడిగా ఉంటాయని, వాతావరణంలో మరింత వేడి నెలకొన్నప్పుడు ఆ విగ్రహాల నుంచి తడి రావడం సాధారణం అని వివరించారు.