School: పాఠశాల ఆవరణలో అగ్నిప్రమాదం.. తల్లి సహా ఇద్దరు పిల్లల మృతి!

  • యూనిఫాం గోడౌన్‌లో అంటుకున్న మంటలు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • పరిస్థితిని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

ఓ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ముగ్గుర్ని బలిగొంది. హరియాణాలోని ఓ కాన్వెంట్ స్కూలులో ఈ ఘోరం జరిగింది. రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా దబువాలోని 'ఎన్ఎన్‌డీ' స్కూలులో యూనిఫాంలు నిల్వ చేసే గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో, కాసేపటికే అవి స్కూలు మొత్తం అలముకున్నాయి.

దీంతో అదే స్కూలు ఆవరణలో నివసించే ఉపాధ్యాయురాలు, ఆమె ఇద్దరు పిల్లలు ఆ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. వీరిని కాపాడేందుకు మరో ఇద్దరు ప్రయత్నించగా వారు తీవ్ర గాయాలపాలయ్యారని, వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.

More Telugu News