సుజనా చౌదరి కంపెనీలకు చెందిన నలుగురు డైరెక్టర్ల అరెస్ట్!
- నిన్నంతా సుజనా చౌదరి ఇళ్లలో సోదాలు
- ఆంధ్రాబ్యాంక్ కు రూ. 71 కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు
- డైరెక్టర్లను విచారిస్తున్న అధికారులు
తప్పుడు ఇన్ వాయిస్ లను క్రియేట్ చేసి ఈ సంస్థ బ్యాంక్ నుంచి రుణాలు పొందినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే సంస్థపై మనీలాండరింగ్ కేసును కూడా సీబీఐ నమోదు చేసింది. ఆపై ఇదే కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసులో ఆంధ్రాబ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 71 కోట్లను ఎగవేసినట్లు సుజనాచౌదరిపై ఆరోపణలున్నాయి. కాగా, తాము అదుపులోకి తీసుకున్న డైరెక్టర్లను ప్రస్తుతం విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.