ఏపీలో భానుడి భగభగలు.. నేడు తీవ్రమైన వడగాల్పులు.. ప్రజలకు ఆర్టీజీఎస్ హెచ్చరిక!
- 44 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
- బయటకు వెళ్లవద్దని ఆర్టీజీఎస్ సూచన
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి
కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలంతా ఎక్కువగా బయట తిరగొద్దని సూచించింది. అత్యవసరమైతే లేతరంగు వస్త్రాలు ధరించే బయటకు వెళ్లాలనీ, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పింది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఎండలు అదరగొడతాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాబోయే 3 రోజుల్లో ఏపీలో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.