పాల్ వన్నీ ప్రగల్బాలే...ఎక్కడా భారీగా ఓట్లు పడింది లేదు
- సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర పరాభవం
- నాలుగైదు మినహా అన్ని చోట్లా 300 లోపే ఓట్లు
- అధికారం నాదే అంటూ హడావుడి చేసిన మతబోధకుడు
ఆయన పార్టీ గుర్తు కూడా హెలికాప్టర్ కావడంతో ఫ్యాన్ను పోలి ఉందని వైసీపీ ఆందోళన చెందింది. కండువా కూడా ఇంచుమించుగా అలాగే ఉండడంతో కుట్రలో భాగమంటూ విమర్శలు కురిపించింది. గుర్తు మార్చాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఇన్ని చేసినా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు దక్కిన ఓట్లు అంతంతే. అత్యధికంగా ఆలూరులో 1327 ఓట్లు రాగా, పలమనేరులో 1107, ఒంగోలులో 400, పెనమలూరులో 300 ఓట్లు వచ్చాయి. జమ్మలమడుగులో అత్యల్పంగా 119 ఓట్లే పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడా 300కు మించి ఓట్లు రాలేదు సరికదా కనీసం డిపాజిట్లు దక్కలేదు.