ఇది ఓట్లు, సీట్లు లెక్కలు వేసుకునే సమీక్షా సమావేశం కాదు: నాదెండ్ల మనోహర్
- మార్పు కోసం పవన్ ప్రయత్నం అభినందనీయం
- పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సమీక్ష
- బరిలోకి దిగిన వారి అనుభవాలు తెలుసుకునేందుకు ఈ సమీక్ష
‘మార్పు’ అనేది స్పష్టంగా కనిపిస్తోంది
జనసేన పార్టీ అధ్యక్షుడు రాజకీయ సలహాదారు పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని అన్నారు. ‘మార్పు’ అనేది స్పష్టంగా కనిపిస్తోందని, ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్కు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెయ్యి, అయిదు వందల ఓట్లు తేడాలు చాలా చోట్ల వస్తాయని, కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బుక్లెట్ను పార్టీ అధినేత పవన్కల్యా ణ్ ఆవిష్కరించారు. ఈ బుక్ లెట్ ను ఈ సమావేశానికి హాజరైన అభ్యర్థులకు అందజేశారు. ఈ సమీక్షలోజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం, పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.