మద్యం మత్తులో రెచ్చిపోయిన కామాంధులు.. ప్రియుడిని కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం

  • కర్ణాటకలోని మైసూరులో ఘటన
  • మాట్లాడుకుంటున్న ప్రేమికులపై దాడి
  • యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం
మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. ప్రియుడి కళ్లెదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. బుధవారం వీరిద్దరూ కలిసి నగర శివారులోని లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నారు.

వారిని చూసిన ఆరుగురు యువకులు అక్కడికి వెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు యువకుడిని పట్టుకుని సమీపంలోని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువతీయువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Go Back to Shorts
Karnataka
lovers
mysore
Crime News

More Telugu News