raviteja: 'డిస్కోరాజా' ఆగిపోయిందనేది పుకారే!

  • 'డిస్కోరాజా'గా రవితేజ
  • ఈ నెల 27 నుంచి రెండవ షెడ్యూల్ 
  • కథానాయికలుగా పాయల్ - నభా 

 రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ కి సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ జోరందుకుంది. ఇతర దర్శకులు రవితేజను సంప్రదిస్తున్నట్టుగా కూడా చెప్పుకున్నారు.

తాజాగా ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ఖండించారు. ఈ సినిమా షూటింగు ఆగిపోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ నెల 27 నుంచి జూన్ 21వ తేదీ వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరపనున్నట్టుగా చెప్పారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News