ప్రారంభమైన ఐదో దశ పోలింగ్.. బరిలో రాహుల్, సోనియా, రాజ్నాథ్, స్మృతి..!
- 51 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోలింగ్
- బరిలో 674 మంది
- నేటితో కలిపి మొత్తం 424 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తి
కేంద్ర సహాయ మంత్రులు అర్జున్రామ్ మేఘ్వాల్, జయంత్సిన్హా, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్, కృష్ణపునియా తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరుగుతోంది. నేటి పోలింగ్తో కలపుకుంటే దేశంలోని 424 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. మిగిలిన 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది.