KTR: నన్ను ఈరోజు ఏదైనా అడగండి.. వెంటనే జవాబిస్తా!: టీఆర్ఎస్ నేత కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రజలతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ చర్చలో ప్రజలు ఏ ప్రశ్నలనైనా తనను అడగొచ్చని అన్నారు.
ఈ మేరకు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు అంతకుముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 16 లోక్ సభ స్థానాలను ఏకపక్షంగా గెలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు అంతకుముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 16 లోక్ సభ స్థానాలను ఏకపక్షంగా గెలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అభిప్రాయపడ్డారు.