Vizag: స్నేహితురాలి సాయంతో జ్యోత్స్న ఫోన్ ను అన్ లాక్ చేసిన పోలీసులు... లెక్చరర్, ఫ్యాకల్టీ అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
విశాఖలో తీవ్ర కలకలం రేపిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, విచారణను కీలక దశకు తీసుకువచ్చారు. జ్యోత్స్న ఫోన్ ను గతంలో ఆమె స్నేహితురాలు పలుమార్లు వాడిందని, ఆ ఫోన్ నుంచి కాల్స్ కూడా చేసేదని గుర్తించిన పోలీసులు, ఫోన్ అన్ లాక్ ప్యాట్రన్ ను ఆమె నుంచి సంపాదించి, విశ్లేషించారు.

ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితులను విచారించిన అధికారులు, ఫ్యాకల్టీ అంకుర్, కాలేజీ లెక్చరర్ ను అరెస్ట్ చేసి, వారిని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ లెక్చరర్ కు ఈ కేసుతో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ కేసులో అసలు నిజాన్ని వెలుగులోకి తెస్తామని పోలీసులు అంటున్నారు. జ్యోత్స్న సెల్ ఫోన్ లోని డేటాను సేకరిస్తున్నామని అన్నారు.
Go Back to Shorts
Vizag
Jyotsna
Police
Sucide

More Telugu News