జగన్ ఏపీ సీఎం కావడం ఖాయం: వైసీపీ నేత రోజా
- రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం లభిస్తోంది
- ప్రజల పక్షాన నిలబడి పోరాడాం
- అసెంబ్లీలో ఉన్న దొంగలను నిలదీశాం
తమ పార్టీ అధికారంలో లేకపోయినా, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను వారి ద్వారానే వైఎస్ జగన్ తెలుసుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ఎవరైతే దొంగలున్నారో వారిని నిలదీశామని, రాష్ట్ర ప్రజలకు వాళ్లు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.