శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.5.07 కోట్లు!

  • రాజాం పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళుతున్న బస్సులో తనిఖీలు
  • వైసీపీ నేత కుమారుడిని విచారిస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు భారీగా నగదు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఓ ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల నిండా తీసుకెళుతున్న నగదును ఈరోజు రాజాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తమదేనని ఎవ్వరూ చెప్పకపోవడంతో బస్సులోని 30 మంది ప్రయాణికులను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు.

తాజాగా ఈ నగదు లెక్కింపును పోలీసులు పూర్తిచేశారు. ఈ మూడు బ్యాగుల్లో కలిపి రూ.5,07,88,000 ఉన్నట్లు తేల్చారు. శ్రీకాకుళం నుంచి పాలకొండకు ఈ నగదును తలరిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే బస్సులో పాలకొండ వైసీపీ నేత కుమారుడు విక్రాంత్ కూడా ఉండటంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Srikakulam District
cash
rtc bus
YSRCP
Police

More Telugu News