Inter: ఏపీ ఇంటర్ ఫస్టియర్ కెమిస్ట్రీ పేపర్ లీక్... పోలీసులకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి!

  • గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో లీక్
  • గంట ముందుగానే ప్రశ్నాపత్రం బయటకు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీకైనట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే బయటకు వచ్చిన పేపర్ ను ఓ జిరాక్స్ సెంటర్ కు తీసుకెళ్లిన కొందరు, దాన్ని జిరాక్స్ తీయిస్తుండగా, చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి, పోలీసులకు ఈ విషయాన్ని ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్వశ్చన్ పేపర్ ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ పేపర్ లీక్ పై విచారణ జరుపుతున్నామని, ఎవరు బయటకు తెచ్చారో తేలుస్తామని అన్నారు. పోలీసులకు ఫోన్ వచ్చిన సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారని, అందువల్ల పరీక్షను అడ్డుకోలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విచారణ జరిపి, ఈ పేపర్ ను ముందే ఎవరైనా చూశారా? అన్న సంగతి తేల్చిన తరువాత, విద్యా శాఖ అధికారులకు నివేదిక ఇస్తామన్నారు.

More Telugu News