పదకొండు రోజులపాటు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
- నేటి నుంచి శ్రీకారం
- తొలుత మూడు, తర్వాత ఐదు రోజులపాటు నిర్వహణ
- తాజాగా మరో ఆరు రోజులపాటు పెంపు
ఉత్సవాల్లో భాగంగా ఈనెల 14న ఎదుర్కోలు, 15న స్వామివారి తిరుకల్యాణం, 16న దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు. కల్యాణోత్సవం రోజున ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.