వైసీపీలా మోసపూరిత హామీలు ఇవ్వలేను.. టీడీపీతో కలిసేది లేదు: పవన్
- వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే భయమేస్తోంది
- వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు
- స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేయొద్దు
వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే తనకు భయమేస్తోందని, దానిని అమలు చేయాలంటే కనీసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని అన్నారు. వైసీపీలా తాను మోసపూరిత హమీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. ఏవైతే నిజాయతీగా చేయగలనో, ఏవైతే అమలు చేయడానికి వీలవుతుందో అటువంటి హామీలు మాత్రమే ఇస్తానని పవన్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ‘డేటా యుద్ధం’పై మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి మొక్కుతున్నానని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేయొద్దని కోరారు.