అణు బాంబుల దిశగా పాక్ చూపు.. జాతీయ కమాండ్ అథారిటీ భేటీకి ఇమ్రాన్ ఖాన్ పిలుపు!

  • బాలాకోట్ లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
  • ఎన్సీఏ సమావేశం నిర్వహించాలని ఇమ్రాన్ నిర్ణయం
  • పార్లమెంటు ఉభయ సభల సమావేశానికి పిలుపు
పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రస్థావరంపై భారత్ వైమానిక దాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే జాతీయ కమాండ్ అథారిటీ(ఎన్సీఏ) సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపర్చాలని నిర్ణయించారు.

మరోవైపు ఈ విషయమై పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషీ మాట్లాడుతూ.. పుల్వామా దాడి తర్వాత భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కశ్మీర్‌లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాల దృష్టి మరల్చడానికే భారత్ ఈ చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆత్మరక్షణలో భాగంగానే పాకిస్థాన్ భారత్ దాడులను తిప్పికొడుతోందన్నారు. బాలాకోట్ లో భారత వైమానిక దళం నిన్న చేసిన దాడిలో 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Pakistan
India
nuclear bomb
imran khan
national command authority

More Telugu News