రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఎయిర్ ఫోర్స్ దాడుల గురించి వివరించిన మోదీ
- కోవింద్, వెంకయ్యలతో మోదీ భేటీ
- వాయుసేన దాడులను వివరించిన ప్రధాని
- అంతకు ముందు తన నివాసంలో హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన మోదీ
ఈ ఉదయం తన నివాసంలో హైలెవెల్ మీటింగ్ ను మోదీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏరియల్ స్ట్రైక్స్ నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో పాటు అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.