వైసీపీకి షాకివ్వనున్న పాణ్యం ఎమ్మెల్యే?
- వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటుపై హామీ ఇవ్వని జగన్
- కాటసాని చేరికతో తగ్గిన ప్రాధాన్యం
- వచ్చే నెల 6న టీడీపీలోకి గౌరు దంపతులు?
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీలో చేరడంతో తమ ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు భావిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి తోడు, వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ను గౌరు చరితకు ఇస్తానని జగన్ హామీ ఇవ్వకపోవడం కూడా ఆమె వైసీపీని వీడాలన్న ఆలోచనకు దారితీసినట్టు గౌరు వర్గీయుల ద్వారా తెలుస్తోంది. వైసీపీకి గౌరు చరిత రాజీనామా చేసి వచ్చే నెల 6వ తేదీన తన భర్తతో పాటు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో తమ అనుచరులు, కార్యకర్తలతో గౌరు దంపతులు సమావేశం కానున్నారని సమాచారం.