మోదీ, నేను అన్నదమ్ములం: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్
- చరిత్రను రాయక ముందు నుంచే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి
- 70 ఏళ్లుగా సౌదీ నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు
- వందల ఏళ్లుగా భారత్ అభివృద్ధిలో సౌదీ ప్రజలు భాగస్వాములుగా ఉన్నారు
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, భారత్-సౌదీ అరేబియాల మధ్య వేల సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చరిత్రను రాయకముందు నుంచే ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగాయని... స్నేహం మన డీఎన్ఏలోనే ఉందని అన్నారు. ఇరు దేశాల అభివృద్ధి కోసం ఈ అనుబంధాన్ని మనం మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీల నాయకత్వంలో భారత్-సౌదీల మధ్య మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయని తాను విశ్వసిస్తున్నానని అన్నారు.
గత 70 ఏళ్లుగా సౌదీ అరేబియా నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని సల్మాన్ కొనియాడారు. వందల ఏళ్లుగా ఎంతో మంది సౌదీ ప్రజలు భారత్ లో పని చేస్తూ, భారత్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని చెప్పారు.