ఎప్పుడూ మత్తులో ఉండే నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావా?: వైసీపీలో చేరిన రవీంద్రబాబుపై కారెం శివాజీ ధ్వజం
- మొహం అద్దంలో చూసుకో
- జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు
- రవీంద్రబాబు ఎవరికీ తెలియదు
- ఆయనను ఎంపీని చేసిందే టీడీపీ
దీనిపై నేడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమలో అసలు రవీంద్రబాబు ఎవరికీ తెలియడని, అటువంటి వ్యక్తి కోనసీమకు నిధులు తీసుకొచ్చానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అసలు ఆయనను గుర్తించి, ఎంపీని చేసిందే టీడీపీ అని శివాజీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ సమస్యలపై మాట్లాడావా? అంటూ నిలదీశారు. ఎప్పుడూ మత్తులో ఉండే నీవు మా పార్టీపై మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. నీ మొహం అద్దంలో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేడని.. అసెంబ్లీకి రాలేడని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజల్లో తిరగలేవని రవీంద్రబాబును హెచ్చరించారు.