నేడు గవర్నర్ తో భేటీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్!
- మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్
- ప్రస్తుతం కేబినేట్ లో మహమూద్ అలీ ఒక్కరే
- 10 మంది కొత్త ముఖాలకు అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి గవర్నర్ తో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే మహమూద్ అలీని కేబినెట్ లోకి తీసుకున్న కేసీఆర్.. మరో 10 మంది కొత్త ముఖాలకు ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.