గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్.. గుంటూరు జిల్లాలో జెండా ఆవిష్కరణ!

  • మంగళగిరి ఆఫీసులో వేడుకలు
  • పాల్గొన్న జనసేన నేతలు, కార్యకర్తలు
  • జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగింపు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్.. నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర నేతలతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
republic day
Guntur District
flag hosting

More Telugu News