CJ Praveen kumar: విజయవాడ చేరుకున్న సీజే ప్రవీణ్ కుమార్, ఇతర న్యాయమూర్తులు

  • రేపు ప్రమాణ స్వీకారం
  • పోలీసుల నుంచి గౌరవ వందనం
  • ప్రత్యేక విమానంలో రానున్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు మరో 13 మంది న్యాయమూర్తులు విజయవాడలోని నోవాటెల్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా సీజే ప్రవీణ్ కుమార్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రేపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే గవర్నర్ నరసింహన్ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. ఉదయం 10:30కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

More Telugu News