కాకినాడ పోర్టులో కుప్పకూలిన క్రేన్లు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
- కొత్త క్రేన్ పై విరిగిపడిపోయిన పాత క్రేన్
- ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
కాగా, ప్రమాదం అనంతరం క్షతగాత్రులను పోర్టు అధికారులు సమీపంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయమై పోర్టు అధికారులు మాట్లాడుతూ.. ఇక్కడి పాత క్రేన్ కు గత కొన్ని రోజులుగా మరమ్మతులు సాగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పాత క్రేన్ ఒక్కసారిగా విరిగిపోయి కొత్త క్రేన్ పై పడిపోయిందని వెల్లడించారు. దీంతో రెండు క్రేన్లు కుప్పకూలిపోయాయని పేర్కొన్నారు. వీటి కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.