aliens: ఏలియన్స్ వచ్చాయంటూ మోదీకి లేఖ.. పరుగులు పెట్టిన పోలీసులు!

  • మహారాష్ట్రలోని పూణేలో ఘటన
  • ప్రధానికి ఈ-మెయిల్ పంపిన వ్యక్తి
  • కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు

ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ఓ విచిత్రమైన లేఖ వచ్చింది. తన ఇంటి వద్ద గ్రహాంతరవాసుల (ఏలియన్స్)కు చెందిన ఓ వస్తువు ఎగురుతూ కనిపించిందని పూణేకు చెందిన ఓ వ్యక్తి(47) తెలిపాడు. భూమిపైకి వచ్చిన ఈ వస్తువు ఇక్కడి కీలక సమాచారాన్ని తమ గ్రహాలకు పంపిందని వెల్లడించాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఓ లేఖను ఈ-మెయిల్ చేశాడు.

అయితే ఈ లేఖను గమనించిన అధికారులు వెంటనే మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సదరు వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులకు షాక్ తగిలింది. ఎందుకంటే సదరు వ్యక్తి లేఖ పంపినట్లు అతని కుటుంబ సభ్యులకే తెలియదట.

ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఈ వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో లోపల రక్తస్రావం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి ఇలాగే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని వెల్లడించారు. దీంతో ఉరుకులు, పరుగుల మీద వచ్చిన అధికారులు మెల్లగా వెనక్కు మళ్లారు.

More Telugu News