Mumbai: ముంబైలో కలకలం... రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన పోలీసులు

  • వకోలా ప్రాంతంలో సీజ్
  • దాడులు చేసిన యాంటీ నార్కోటిక్స్ సెల్
  • నలుగురి అరెస్ట్

కొత్త సంవత్సరం వేడుకల్లో వాడే నిమిత్తం ముంబైలో సిద్ధం చేసిన రూ. 1000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. వకోలా ప్రాంతంలో నిషేధిత డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ లో భాగమైన యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్దఎత్తున ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

More Telugu News