2019 తర్వాత ప్రధాని ఎవరన్న దానిపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
- ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి
- ఈ దేశాన్ని మతతత్వ దేశంగా చూడాలనుకోవడం లేదు
- రామ మందిరం నిర్మించకుంటే బీజేపీని నమ్మరు
ఇచ్చిన హామీ ప్రకారం అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీ విశ్వసనీయత కోల్పోవడం ఖాయమన్నారు. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై బాబా రాందేవ్ స్పందిస్తూ.. భారత్ను మతపరమైన అసహన దేశంగా చిత్రీకరిస్తూ, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారని మండిపడ్డారు.