sensex: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం.. కుప్పకూలిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, రూపాయి విలువ బలహీనపడటం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో, ఎలక్షన్ ట్రెండ్స్ పై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. వీటన్నింటి ప్రభావంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 572 పాయింట్లు పతనమై 35,312కు జారిపోయింది. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 10,601కి దిగజారింది.

టాప్ గెయినర్స్:
వక్రాంగీ (4.97%), సొనాటా సాఫ్ట్ వేర్ (4.50%), హెచ్డీఐఎల్ (4.17%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (4.02%), పీఐ ఇండస్ట్రీస్ (3.49%).

టాప్ లూజర్స్:
నవకార్ కార్పొరేషన్ (-10.35%), శారద క్రాప్ కెమ్ లిమిటెడ్ (-7.67%), ఎన్సీసీ (-7.27%), ముత్తూట్ ఫైనాన్స్ (-7.10%), సౌత్ ఇండియన్ బ్యాంక్ (-6.19%).     
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News