sundaram: నాకు స్ఫూర్తి ప్రభుదేవానే: సుందరం మాస్టర్

  • నా ముగ్గురు కొడుకులు నాకు సమానమే 
  • నిర్మాతగా ఒక సినిమా చేశాను 
  • అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను   

వెండితెరపై హీరోల డాన్స్ విషయంలో కొత్త ఒరవడిని సృష్టించింది సుందరం మాస్టర్ అనే చెప్పాలి. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా తనని తాను మలుచుకుంటూ .. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ ఒక ట్రెండ్ సెట్టర్ గా ఆయన నిలిచారు. అలాంటి ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

"ప్రభుదేవా .. రాజు .. ప్రసాద్ ఈ ముగ్గురూ నాకు సమానమే. ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ అంటే నేను చెప్పలేను. అయితే ఈ ముగ్గురిలో నాకు స్ఫూర్తి ప్రభుదేవానే అని చెబుతాను" అన్నారు. "తెలుగులోని 'మనసంతా నువ్వే' సినిమా కన్నడ రైట్స్ తీసుకుని, నా ముగ్గురు కొడుకులతో నిర్మించాను. ఆ సినిమాను ఎవరూ కొనకపోవడంతో ఓ మూడు చోట్ల నేనే రిలీజ్ చేశాను .. బాగానే ఆడింది. అప్పుడు పడిన ఇబ్బందుల కారణంగా ఇక సినిమా నిర్మాణం జోలికిపోకూడదని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News