ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మరో సంచలన నిర్ణయం.. కంగుతిన్న ప్రజలు
- మార్చి వరకూ వివాహాలు రద్దు
- కుంభమేళా కారణంగా యోగి ఆదేశం
- గంగానదిలో ఆరు రకాల స్నానాలు
- 15 నుంచి తోళ్ల పరిశ్రమల మూసివేత
అయితే ఇప్పటికే తమ ఇంట్లో వివాహం కోసం ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బుక్ చేసుకున్న ప్రయాగ్రాజ్ వాసులు ఈ వార్త విని షాక్ అయ్యారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్ హాళ్ల యజమానులు, క్యాటరింగ్ చేసే వాళ్లు ఈ ఆదేశాల నేపథ్యంలో ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కుంభమేళా కోసం వచ్చే భక్తులు గంగానదిలో ఆరు రకాల స్నానాలు ఆచరిస్తారు. దీనికోసం గంగానదిని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను.. వచ్చే ఏడాది డిసెంబర్ 15 నుంచి మార్చి 15 వరకూ తోళ్ల పరిశ్రమలన్నీ మూసివేయాలని యోగి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.