కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చేతులు కలపడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ
- తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ కల్లలు చేసింది
- ఓ వ్యక్తి తనకు తోచిన విధంగా దుర్మార్గపు పాలనను కొనసాగించారు
- నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం
టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడబోతున్నామని తెలిపారు. ఈ నిరంకుశ పాలనను కూల్చేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చేతులు కలిపాయని చెప్పారు. ఏ కలలతో తెలంగాణను తెచ్చుకున్నామో, ఆ కలలను కల్లలు చేసిన టీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపుదామని తెలిపారు.
తనకు తోచిన విధంగా వ్యవహరిస్తూ ఓ వ్యక్తి దుర్మార్గపు పాలన కొనసాగించారని కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క వ్యక్తి కోసమో ఏర్పడలేదని... ప్రజలందరి కోసం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా, అందరి బతుకులు బాగుపడేలా పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. మహాకూటమికి చెందిన ఈ సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కూటమిలోని నాలుగు పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు.