బాబా పిలుపుతోనే నేను ఇక్కడకు వచ్చా: చంద్రబాబు
- సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
- బాబాతో తనకున్న అనుబంధం అపురూపమైనదన్న సీఎం
- సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందన్న చంద్రబాబు
మానవసేవయే మాధవసేవ అని ప్రపంచానికి బాబా చాటిచెప్పారని చంద్రబాబు అన్నారు. బాబా చెప్పిన సూక్తులను, మార్గాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పారు. బాబా అనుగ్రహం ఉంటేనే ఇక్కడకు రాగలమని, ఆయన పిలుపుతోనే తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలని తనకు అనిపిస్తుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమా, జవహర్, శిద్దా రాఘవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ లు పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డిలు కూడా హాజరయ్యారు.