200 ఏళ్ల క్రితమే శబరిమల నియమాలు... బ్రిటిష్ నివేదిక!
- 1820లో నివేదిక తయారు చేసిన బ్రిటీష్ అధికారులు
- 19వ శతాబ్దం తొలినాళ్లలో రెండు భాగాలుగా ముద్రణ
- సంప్రదాయవాదుల వాదానికి మరింత బలం
ఇప్పుడీ రిపోర్టు సంప్రదాయవాదులకు వరం కానుంది. శతాబ్దాల సంప్రదాయాన్ని మార్చరాదన్న తమ వాదనను వినిపించేందుకు ఈ రిపోర్టు సహకరిస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. శబరిమలను నాడు 'చౌరీముల్లా' అని పిలిచేవారని, 1820 సమయంలో ఏడాదికి 15 వేల మంది వరకూ భక్తులు ఆలయానికి వస్తుండేవారని తెలిపింది. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే నియమం అలిఖితమని సదరు బ్రిటీష్ అధికారుల నివేదిక పేర్కొంది. బాలికలు, వృద్ధురాళ్లు ఆలయంలోకి వెళ్లవచ్చని, యుక్త వయసువారు, లైంగిక చర్యలో పాల్గొనే వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశం నిషిద్ధమని తెలిపింది.