పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఒడిశా పిటిషన్.. 27న విచారణ
- శరవేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులు
- ‘పోలవరం’ వల్ల తీరని అన్యాయం జరుగుతుందన్న ఒడిశా
- తక్షణం ఆపించాలంటూ సుప్రీంకోర్టుకు
మరోవైపు, ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్లో జోరు పెంచింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును సిద్ధం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా వేసిన వ్యాజ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.