Bihar: తల్లికి ఫోన్ చేసిన తేజ్ ప్రతాప్... 'బాబూ ఎప్పుడొస్తావ్?' అంటూ రబ్రీ కన్నీరు!

షార్ట్స్‌లో చూడండి
తన భార్య ఐశ్వర్యకు దూరమై, విడాకులు కోరి, ప్రస్తుతం మనశ్శాంతి కోసం దేవాలయాలు సందర్శిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్, తన తల్లికి ఫోన్ చేశారు. ఇప్పటికే కుటుంబానికి దూరమైన కుమారుడిని తలచుకుని రబ్రీదేవి కుమిలిపోతుండగా, ఆమెకు ఫోన్ చేసిన తేజ్, తల్లిని అనునయించే ప్రయత్నం చేశారట.

'బాబూ ఎప్పుడొస్తావ్?' అంటూ రబ్రీ కన్నీరు పెట్టుకోగా, తన గురించి బెంగ వద్దని, 23వ తేదీ తరువాత ఇంటికి వస్తానని హామీ ఇచ్చారట. కాగా, ఇంట్లోని వారు తన గురించి పట్టించుకోవడం లేదని, అందుకే ఇంటికి దూరమయ్యానని తన స్నేహితుడు లక్ష్మణ్ ప్రసాద్ వద్ద తేజ్ ప్రతాప్ వాపోయారని తెలుస్తోంది.
Go Back to Shorts
Bihar
Tej Pratap
Rabridevi
Aishwarya

More Telugu News