పొన్నాలకు మళ్లీ మొండి చెయ్యి.. జనగామ అగ్నిగుండం అవుతుందని కాంగ్రెస్ నేతల వార్నింగ్!
- రెండో జాబితాలోనూ పొన్నాలకు దక్కని చోటు
- తీవ్రంగా స్పందించిన జనగామ కాంగ్రెస్ నేతలు
- బీసీలు దూరమవుతారని హెచ్చరిక
ఒకవేళ పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కేటాయించకుంటే జనగామ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం చర్యలతో బీసీలు దూరమయ్యే పరిస్థితి నెలకొందని జనగామ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు వై. సుధాకర్, ధర్మపురి శ్రీను, అన్వర్, గిరికొండల్ రెడ్డి, మేడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.