Vijay Sai Reddy: కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకి భయం: విజయసాయిరెడ్డి

  • కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట
  • చంద్రబాబు ఎంత డబ్బు అయినా పంపిస్తారట 
  • ట్వీట్ చేసిన వైసీపీ నేత

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విట్టర్లో స్పందించారు. ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే, కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్‌ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని' అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News