ఇక మీ ఇష్టం... మహాకూటమి మిత్రుల విషయంలో చేతులెత్తేసిన కాంగ్రెస్!
- టీజేఎస్ కు 8, సీపీఐకి 3 మాత్రమే
- అంతకుమించి ఇవ్వలేము
- స్పష్టం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
- నేడు మహాకూటమి కీలక చర్చలు
- కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై ఉత్కంఠ
కాంగ్రెస్ ఇస్తామన్న సీట్లతో సర్దుకుపోయేలా సీపీఐ కనిపించడం లేదు. మరోవైపు టీజేఎస్ సైతం తమకు అధిక సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ తొలుత 14 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించి, ఇప్పుడు మరో రెండు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీపీఐ కూటమి నుంచి బయటకు వెళితే, టీజేఎస్ కు 9, టీడీపీకి 15 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.