kolkata: రేపటి నుంచి భారత్-వెస్టిండీస్ టీ 20 సిరీస్!

  • రేపటి నుంచి మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ 
  • కోల్ కతా వేదికగా తొలి మ్యాచ్
  • ఈ సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి.. రోహిత్ శర్మ సారథ్యం 

వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారతజట్టు, 3-1 తేడాతో వన్డే సిరీస్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ 20 సిరీస్ కు భారత జట్టు సిద్ధమవుతోంది. మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రేపు కోల్ కతా వేదికగా జరగనుంది. రేపు రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడంతో.. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది.

కాగా, ప్రస్తుతం టీ 20 ఛాంపియన్ గా ఉన్న వెస్టిండీస్ జట్టు తన ఆధిక్యాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. టెస్ట్, వన్డే సిరీస్ లు ఓడిన వెస్టిండీస్ జట్టు.. టీ20 ఫార్మాట్ లోనైనా భారత్ పై ఆధిక్యం సాధించాలని కృషి చేస్తోంది. 2009-2017 మధ్య ఇరు జట్ల మధ్య 8 టీ20 మ్యాచ్ లు జరగగా, విండీస్ ఐదింటిలో, భారత్ రెండింటిలోనూ నెగ్గాయి.

More Telugu News