ఏమిటీ ఉన్మాదం?... అర్చకుడి హత్యపై పరిపూర్ణానంద ఆగ్రహం!
- భక్తి గీతాలను మైక్లో ప్రసారం చేస్తున్నాడని దాడి
- చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన అర్చకుడు
- అంత్యక్రియలకు హాజరైన పరిపూర్ణానంద
సత్యనారాయణ అంత్యక్రియలకు శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద హాజరయ్యారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ హత్యపై పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు చేస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. అర్చకులపై ఇలాంటి దాడులు జరుగుతుంటే పూజలు, పండుగలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. మదార్సాలలో ఇలాంటి ఉన్మాదులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం గుర్తించాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.