సీబీఐ అధికారుల అవినీతిపై నిష్పాక్షిక విచారణ జరుపుతాం!: అరుణ్ జైట్లీ
- ఇద్దరు సీనియర్ అధికారులు ఆరోపణలు చేసుకున్నారు
- అందుకే వారిని తాత్కాలిక సెలవుపై పంపాం
- వర్మ, ఆస్థానాపై సిట్ విచారణ జరుపుతోంది
సీబీఐ సంస్థ సమగ్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. అలోక్ వర్మ, అస్థానాలపై కేసులను సిట్ బృందం విచారిస్తోందని తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నిన్న అత్యవసరంగా సమావేశమయిందన్నారు.
ఇద్దరు సీబీఐ అధికారులపై వస్తోన్న ఆరోపణలను ఏ ఏజెన్సీ అయినా విచారణ చేయవచ్చని సీవీసీ తమకు చెప్పిందన్నారు. ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం మాత్రమేననీ, సీవీసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం వర్మ, అస్థానాలపై చర్య తీసుకుందని జైట్లీ పేర్కొన్నారు.